వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అశోక్ గజపతిరాజు ధర్మకర్తా..? అధర్మకర్తా..?
03 Sep 2021 5:31 PM
సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజం
విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన ఆస్తులను కాపాడుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సింహాద్రి అప్పన్నను ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ పేరుతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్టు చైర్మన్గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్లు దోచుకున్నారని, సుమారు 846 ఎకరాలు పరాధీనంపాలైతే అశోక్ గజపతి రాజు ప్రేక్షకపాత్ర వహించాడా..? లేక స్వయంగా ఆయన కూడా భాగస్వామా..? తేలాల్సి ఉందన్నారు. వంశపారంపర్య ధర్మకర్తగా పిలచుకుంటున్న అశోక్ గజపతిరాజు ధర్మకర్తా..? అధర్మకర్తా..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే భూ సమస్యను పరిష్కారిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.