తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్సీ కరిమున్నీసా కుమారుడు రుహుల్లాను సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రుహుల్లా బీఫాం అందుకున్నారు. ఇటీవల కరీమున్నిసా కన్నుమూయడంతో ఆమె స్థానంలో కుమారుడికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. దీంతో మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రుహుల్లా సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.