అసత్యాలతో టీడీపీ తప్పుతోవ పట్టిస్తోంది

టీడీపీ ప్రభుత్వం రైతులు,మహిళలను మోసం చేసింది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌

అమరావతిః2014 ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు పావలావడ్డీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని..కాని ఐదు శాతం కూడా అమలు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ అన్నారు.ఆయన ఏపీ అసెంబ్లీ  మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. 2019లో టీడీపీ మేనిఫెస్టోలో పూర్తిగా రుణమాఫీ  చేశామని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు.కేవలం 600 కోట్లు మాత్రమే మాఫీ చేశారని..అది రైతులను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు.అవాస్తవాలతో టీడీపీ ప్రజలను పక్కదారి పట్టిస్తుందన్నారు.గత టీడీపీ ప్రభుత్వం రైతులు,మహిళలను మోసం చేసిందన్నారు.అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడేటప్పుడు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంతా అడ్డు చెప్పకుండా విన్నారని..అనంతరం సభ నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుంటే ప్రతిపక్షం సభ్యులు పెద్ద ఎత్తున గొంతు విప్పి  అడ్డు తగలడం చాలా దారుణమన్నారు.  

తాజా వీడియోలు

Back to Top