తాడేపల్లి: ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమలులోకి రాకముందే చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు పచ్చమీడియాతో కలసి కుట్రపూరితంగా విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. - ఏపిలో 17 వేల గ్రామాలకు గాను కేవలం ఆరువేల గ్రామాలలోనే భూ రీసర్వే పూర్తి అయింది. - అన్ని గ్రామాలలో పూర్తి అయితేనేగాని చట్టం అమలులోకివచ్చే పరిస్దితి ఉండదు. - రైతులు,భూయజమానులు అభ్యంతరాలు తెలియచేసే అవకాశం ఉంది. - అది జరిగేందుకు ఇంకా రెండు,మూడేళ్ల సమయం పడుతుంది. - రామోజి,రాధాకృష్ణ,పవన్ కల్యాణ్ లకు రైతులకు గురించి భూములు గురించి మాట్లాడే నైతికహక్కు లేదు. - చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు. - దుష్ప్రచారాలతో,తప్పుడు రాతలతో ప్రజలలో యాక్ట్ గురించి అయోమయం కలగచేస్తున్నారు. - జగన్ గారిని ఉద్దేశ్యించి భూములను దోచుకుంటున్నారని కుట్రపూరితంగా విషం చిమ్ముతున్నారు. - రాష్ర్టంలో పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్. - ప్రజలు గమనించాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన అడంగల్,ib,భూములు అక్రమాలకి గురి కావు.వాటికి సంబందించి ఇబ్బందులు కలగకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో అవకాశం ఉంది - బీజేపీ కేంద్ర నాయకులు రాష్ర్టంలో పర్యటన చేస్తున్నారు కూటమి లో భాగస్వామి అయిన బిజేపి నేతలతో ఈ యాక్ట్ సరైంది కాదని చెప్పించే దమ్ము చంద్రబాబు,పవన్ కి ఉందా.. - బిజేపి రాష్ర్ట అద్యక్షురాలు పురేందేశ్వరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సరైనదని అన్నారు. - ఎన్నికల సమయంలో జగన్ గారి వ్యక్తిత్వ హననం జరుగుతోోంది.ఇందుకు సంబంధించి భారీ కుట్ర జరగుతోంది. - అమిత్ షా పోలవరం గురించి మాట్లాడారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలి. - పోలవరం ను ఏటిఎం లా చంద్రబాబు వాడుకున్నాడని నరేంద్ర మోది బహిరంగంగా ప్రకటించారు. - కేంద్రం నిర్మించాల్సిన పోలవరం రాష్ర్టం ఎందుకు నిర్మిస్తోంది.చంద్రబాబు దోచుకోవడానికి అలా చేసిన విషయం ప్రజలందరికి తెలుసు. - బ్రిటీష్ కాలం నాటి రికార్డులను ఆధునికరించి భూవివాదాలు లేకుండా చేయాలని చట్టంలో నిర్దేశించారు.