వైయ‌స్ జ‌గ‌న్ ఏనాడు ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డ‌లేదు

ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
 

తిరుమల: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడు ఎన్నికలకు భయపడ లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. 2018లో చంద్రబాబే స్థానిక సంస్థ‌ల ఎన్నికలకు భయపడి పారిపోయార‌ని ఆమె అన్నారు. ఆదివారం రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం సబబు కాదని..  ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రోజా తప్పుపట్టారు. వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు జరపాల్సిన అసవరం ఏమిటని ప్రశ్నించారు.  కోవిడ్‌ సమయంలో చంద్రబాబు ఎటువంటి సహకారం, సాయం అందించలేదని రోజా మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే.. ధర్మాసనాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతామన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలకు వైయ‌స్ఆర్‌‌సీపీ ఎప్పుడైనా సిద్ధమేనని.. తమ​ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షా అని రోజా వ్యాఖ్యానించారు.   

తాజా వీడియోలు

Back to Top