మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
నారా లోకేష్ ట్విట్టర్ వీర ఉత్తర కుమారుడు
05 Sep 2020 4:09 PM
ఉచిత విద్యుత్పై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం: హైదరాబాద్లో దాక్కొని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రతిపక్షం పాత్రను సైతం విస్మరించారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. నారా లోకేష్ ట్విట్టర్
వీర ఉత్తర కుమారుడని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరిగిన అనేక విపత్తుల్లో బాధితులను పరామర్శించడానికి కూడా చంద్రబాబుకు సమయం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తన సామాజిక వర్గం ఉన్నతి కోసం పాటుపడుతున్నారు తప్ప.. రాష్ట్రం కోసం పాటు పడిన దాఖలాలు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.
ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత మహానేత వైయస్ఆర్. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒకే ఒక్క పథకం బెల్టుషాపు పథకమని ఆయన ఎద్దేవా చేశారు. . ప్రతి పేదవాడికి ఇంటిపట్టాలను ఇచ్చే మంచి కార్యక్రమానికి మోకాళ్ళడ్డిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆయనను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు