తాడేపల్లి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ప్రజలలో అపోహలు సృష్టించేందుకు విషప్రచారం చేస్తున్నాయని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉన్న భూములకు సంబంధించి వివాదాలు,విబేధాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ తో తయారుచేసి 2019లో అన్ని రాష్ట్రాలకు పంపింది. దానిలో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ తీసుకురావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో భూ రీసర్వే జరపాలని నిర్ణయించారు. ప్రధానంగా 100 ఏళ్ళ నాటి బ్రిటీష్ వాళ్ల కాలం నాటినుంచి సర్వేలలో ఉన్న రికార్డులను నేటి భూరీసర్వే ద్వారా మెరుగుపరిచారు. భూముల సరిహద్దు వివాదాల వల్ల అనేక కేసులు కోర్టులలో వస్తున్నాయి.వివాదాలు క్రిమినల్ కేసులు దాకా వెళ్తున్నాయి. జగన్ గారు సమస్యలను పరిష్కరించాలనే సదుధ్దేశ్యంతో దేశవ్యాప్తంగా ఎవ్వరూ తీసుకోని విధంగా భూసర్వేకు మన రాష్ర్టంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్టంలో 6 వేల గ్రామాలలో సమగ్ర భూరీసర్వే జరిగింది.మిగిలిన గ్రామాలలో జరగాల్సి ఉంది. డిజిటలైజేషన్ పద్ధతిలో భూయజమానులకు రికార్డులు ఇచ్చారు. అన్ని గ్రామాలలో భూసర్వే పూర్తి అయ్యాకనే ఈ చట్టం అమలులోకి తెస్తారు. కొంతమంది న్యాయవాదులు కోర్టులలో కేసులు వేస్తే ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది.దీనిని ఇప్పుడిప్పుడే మేం అమలులోకి తేవడం లేదు అని. రెండేళ్ల తర్వాతనే అమలు చేస్తామని చట్టంపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయమని కూడా అడిగింది. ప్రతిపక్షనేతలు జగన్ భూములు లాక్కుంటాడని అబద్ధాలు చెబుతున్నారు. సమగ్ర భూ రీసర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. భూ హక్కు దారుడుకి యూనిక్ కార్డు కూడా వస్తుంది.దాని వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. జిరాక్స్ కాపీలు ఇస్తారు.వరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి దగ్గర పెట్టుకుంటారంటూ అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం దారుణం వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు భూ స్కామ్ లకు పాల్పడింది చంద్రబాబు అండ్ కో నే అన్నారు. అలాంటి స్కామ్ లకు చోటివ్వకూడదనే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువస్తు్న్నాం.