సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం

తాడేప‌ల్లి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైయ‌స్ఆర్ ‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రూ.కోటి విరాళం ఇచ్చారు. బుధవారం విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, అన్నె చిట్టిబాబు, రాజులపాటి రామచంద్రరావు, దోనేపూడి కిరణ్, హనుమంతరావు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top