వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బోగస్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త
05 Feb 2019 4:38 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం
అమరావతి : రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ పేరుతో బోగస్ సర్వే జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని గుర్తించి వారి ఆధార్ నెంబర్తో బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించి, సానుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. వీరిపై ఫిర్యాదు చేసినా పోలీసు యంత్రాంగం స్పందించడం లేదని, ప్రజలు బోగస్ టీమ్కు సహకరించవద్దన్నారు. తప్పుడు సమాచారంతో జిల్లాలో సర్వే బృందాలు ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.