విజయవాడ: దళిత సంక్షేమంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు..దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు మేలు చేసిందని, మహానేత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహానేత సంక్షేమ పథకాలను చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక దళితులు పదేళ్లు వెనక్కివెళ్లిపోయారన్నారు. దళితుల్లో ఎవరు పుడతారని హేళనగా మాట్లాడారన్నారు. దళితులను అవమానించిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. దళిత సంక్షేమంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెగిరిపోయాయన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు దళితులను మురికివాళ్లు అని మాట్లాడారన్నారు. రాష్ట్రంలో దళితులకు రాజ్యంగా బద్ధంగా రావాల్సిన వాటా దక్కడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నామని చెప్పడం దుర్మార్గమన్నారు. మీరు వేసే ప్రతి రోడ్డులో వైయస్ రాజశేఖరరెడ్డి చమట చుక్కలు ఉన్నాయని గుర్తించాలన్నారు. ఆ రోడ్లలో కూడా అవినీతిమయం అయ్యిందన్నారు. సబ్ ప్లాన్ నిధులు 60 శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. దళితుల సొమ్ము అన్యాక్రాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో 6 వేల హాస్టల్స్, స్కూల్స్ మూసివేశారన్నారు. దళితులకు బడ్జెట్లో ఒక్కపైసా కూడా పెంచలేదన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల భూములను లాక్కుంటున్నారని, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తామని, సెల్ఫోన్ ఇస్తామని ఎన్నికల ముందు మోసం చేసేందుకు డబ్బా ఫోన్ ఇస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయిన తరువాత డబ్బులు ఇ స్తావా అని ఫైర్ అయ్యారు. దళితులకు నీడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. దళిత వ్యతిరేక చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.