పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
ప్రాంతీయ విభేదాలకు ఆస్కారం లేకుండా మూడు రాజధానులు
24 Sep 2022 3:22 PM
వైయస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకర్రావు
విశాఖ: ప్రాంతీయ విభేదాలకు ఆస్కారం లేకుండా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్రావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ఎక్కడికి వెళ్ళలేదు..నారాయణ కాలేజీలతో పాటు అమరావతి అక్కడే వుంటుంది. విశాఖ పరిపాలనతో పాటు ఆర్థిక రాజధానిగా మారుతోందన్నారు. సీఎం రమేష్ మీరు బీజేపీ నా లేక టీడీపీనా ముందు చెప్పాలని డిమాండు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు..అమరావతి అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం అమరావతి తో పాటు అన్ని ప్రాంతాలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ను కుప్పం ప్రజలే వెళ్లిపొమంటున్నారు. చంద్రబాబు చేసిన రెండు లక్షల కోట్లు అప్పు ఈ ప్రభుత్వం తీరుస్తోంది. దేశంలో వేలాది మంది వలస కార్మికులు కరోనా సమయంలో చనిపోతే ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కరోనా మహమ్మారి వేళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పారాసెటమాల్ వేయమంటే నవ్వారు..ఇప్పుడు అదే ప్రోటోకాల్ టాబ్లెట్ అయ్యిందని జూపూడి ప్రభాకర్ గుర్తు చేశారు.