తిరుపతి: టీటీడీ గోశాల మరణాలపై చర్చకు సిద్ధమా అంటూ వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డికి ఎక్స్ వేదికగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఛాలెంజ్ చేసి పత్తా లేకుండా పోయారు. టీడీపీ సవాలును స్వీకరించిన మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలకు బయలుదేరగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి , వైయస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు భూమన ఫోన్ చేసి ..మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్కు సిద్ధమని, గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను రెడీగా ఉన్నానని చెప్పారు. గోశాల వద్దకు రండి అని భూమన ఫోన్లో పిలువగా పల్లా శ్రీనివాస్ కాల్ కట్ చేసి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘గోశాలకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయం. గోవుల మృతిపై కూటమి నేతలో తలో మాట మాట్లాడుతున్నారు. నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్ రావు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ను స్వీకరించా. గోశాల వద్ద ఘోరాలను వెలకితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుంది. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలి’ అని డిమాండ్ చేశారు. గోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా? : ఆర్కే రోజా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్కు భూమన సిద్ధమయ్యారని, గోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా? అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, కొండపై డ్రైవర్ను కొట్టి చంపితే విజిలెన్స్ ఏం చేస్తోందని మండిపడ్డారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?. క్యూలైన్లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్ జరిగిందా? అని ధ్వజమెత్తారు. సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కల్యాణ్? అంటూ ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.