నేడు రెండు చోట్ల రీ-పోలింగ్

రీ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైయ‌స్ఆర్‌సీపీ

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందులలో టీడీపీ నేతల అరాచకాన్ని కప్పి పుచ్చేందుకు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్‌కి ఆదేశించింది. బుధ‌వారం అచివెల్లి, ఈ.కొత్తపల్లి బూత్‌లలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే, మొత్తం పోలింగ్ బూత్‌లలో మళ్ళీ రీ-పోలింగ్ నిర్వహించాలని వైయ‌స్ఆర్‌సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ వారి అభ్యర్థనను ఈసీ పెడచెవిన పెట్టింది. దీంతో రీ పోలింగ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ బ‌హిష్క‌రించింది.  
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేక­పోయారని, అందువల్ల రీ–పోలింగ్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ కడప వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రా­శారు. పోలింగ్‌ సందర్భంగా టీడీపీ చేసిన అరా­చ­కాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు విని­యోగించుకోలేకపోయారని వివరించారు.  

Back to Top