ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. పార్ల‌మెంట్ హౌస్‌లో ప్ర‌ధాని మోదీని క‌లిసి ఏపీ పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని, రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన వారిలో ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, వంగా గీత, గోరెంట్ల మాధ‌వ్‌, స‌త్య‌వ‌తి, రెడ్డ‌ప్ప త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top