హైదరాబాద్: వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, విశాఖ జిల్లాలోని అరకు శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పామర్రు, గుడివాడ, గన్నవరం, నూజివీడుల్లో నేడు షర్మిల ప్రచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నేడు కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, గన్నవరం, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు. రోడ్ షో, బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు.