నేడు వైయ‌స్ఆర్‌ జిల్లాకు వైయ‌స్ జగన్‌ రాక 

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ రెండు రోజుల పాటు  వైయ‌స్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని రాత్రి అక్కడి నివా­సంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. 
అక్క­డ దివంగత సీఎం వైయ‌స్ఆర్ ఘాట్‌లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. 

Back to Top