ప్ర‌భుత్వాన్ని నిద్ర లేపేందుకే బంగారుపాళ్యం వ‌చ్చా? 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంది

ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేదు

కిలో మామిడి 2 రూపాయ‌లా? ఇదేం దారుణం

క‌ర్ణాట‌క రాష్ట్రంలో కిలో మామిడి రూ.16కు కేంద్రం కొనుగోలు

రాష్ట్రంలో చంద్ర‌బాబు గాడిద‌లు కాస్తున్నారా?

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో కిలో రూ.22 నుంచి రూ.29కు కొన్నాం

రైతుల‌ను క‌లువ‌కుండా ఎందుకు ఆంక్ష‌లు పెడుతున్నారు

రైతుల త‌లలు ప‌గుల‌గొడ‌తారా?  1200 మందిని జైల్లో పెడ‌తారా?

రాష్ట్రంలో ఉండేది పోలీసులా?  రాక్ష‌సులా?

రేపు పోలీసుల‌ను కూడా చంద్ర‌బాబు మోసం చేస్తాడు

అప్పుడు నేనే మీ త‌ర‌ఫున పోరాటం చేయాల్సి ఉంటుంది

కూట‌మి ప్ర‌లోభాలు, లంచాల‌కు పోలీసులు లొంగ‌వ‌ద్దు

మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
 
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో మామిడి రైతుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

చిత్తూరు జిల్లా:  రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం నిద్ర‌పోతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రైతుల జీవితాలు నాశనం చేయాలని ప్ర‌భుత్వ‌మే కుట్రలు చేస్తుంద‌ని,  రైతులను రౌడీ షీటర్లతో పోలుస్తారా? అంటూ ఆ గ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
రైతుల సమస్యలపై మాట్లాడితే భయమెందుకని ప్ర‌శ్నించారు. నిద్ర‌పోతున్న ప్ర‌భుత్వాన్ని లేపేందుకు బంగారుపాళ్యం వ‌చ్చాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.  కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలు ఆరా తీసిన వైయస్‌ జగన్, ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్ ఏమ‌న్నారంటే..

మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారు:

  • మామిడి ౖరైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. 
  • వైయ‌స్ జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు.
  • రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? 
  • అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.

ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు:

  • వరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.
  • ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?.
  • ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు. 

కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?:

  • చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? 
  • జూన్‌ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.
  • దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.

నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?:

  • కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది.
  • అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.
  • ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు.
  • 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.

నాడు కిలో రూ.29. మరి నేడు?:

  • మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు.
  • ఇంకా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది.
  • ఇవాళ అన్ని వ్యవస్థలునిర్వీర్యమయ్యాయి.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి:

  • ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.
  • లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.

అసలు మీరు మనుషులేనా?:

  • ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది?
  • దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?
  • ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్‌ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటున్నాడు.
  • వచ్చేది వైయ‌స్ జగన్‌ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి.
Back to Top