చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదు

పార్టీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌
 

అమ‌రావ‌తి: తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయం కూల్చివేత ఘటనపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు.. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. 


‘‘చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు..  ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు.

అయినా ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అని వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

Back to Top