నెల్లూరు: ప్రతి అవ్వకూ తాతకు, అక్క చెల్లమ్మలకు చెప్పండి.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు..అన్న వస్తే అన్నీ మంచి రోజులేనని చెప్పాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. నెల్లూరు సమర శంఖారావం సభలో వైయస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా సీఎం కుర్చీలో ఉండే అర్హత లేదని వైయస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో మనకు, టీడీపీ మధ్య ఉన్న ఓట్ల తేడా ఎంతో తెలుసా..కేవలం 5 లక్షల ఓట్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారు. మీ ఓటు ఉందో లేదో ఓటర్ లిస్టులో చూసుకోండి. ఓటర్ కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్తో 1950కు ఎస్ఎంఎస్ ఇస్తే ఓటు ఉందో లేదో రిప్లై వస్తుంది. ఓటు లేకపోతే ఆన్లైన్ ద్వారా ఫామ్–6 అప్లై చేసుకోవచ్చు. ఎంఆర్వో దగ్గర కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. దొంగ ఓట్లు తీయించదలచుకుంటే ఫామ్–7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మనల్ని ప్రేమించే ప్రతి ఒటరూ లిస్టులో ఉన్నాడా? లేడా అనేది చూడాలి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే సీ–విజిల్ అనే యాప్ కనిపిస్తుంది. మన స్మార్ట్ పోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. చంద్రబాబు ఎక్కడైనా అన్యాయం చేస్తున్నట్లు మీకు అనిపిస్తే..మీ ఫోన్లోని ఆ సీవిజిల్యాప్ద్వారా రికార్డు చేసి సెండ్అనే బటన్ నొక్కండి. వంద నిమిషాల్లోనే దీనిపై యాక్షన్ తీసుకుంటారు. అందరూ కూడా సీ–విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది మరిచిపోవద్దు చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తున్నామన్నది ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఆధార్ కార్డు, ఫొటో లిస్టు, బ్యాంకు అకౌంట్లు టీడీపీ సేవా మిత్ర యాప్కు అనుసంధానం చేసి ఆ డేటాను టీడీపీ నేతలకు పంపారు. ప్రతి గ్రామానికి ఇంటలీజెన్స్ అధికారులు వస్తున్నారు. పోలీసులను చంద్రబాబు దారుణంగా వాడుకుంటున్నారు. పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్కొట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ టోపీ వెనుక ఉన్న నక్కలకు సెల్యూట్ కొట్టిస్తోంది. ఇవాళ గ్రామాలకు తమ వారిని పంపించి వైయస్ఆర్సీపీ ఓట్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను ఎలా కొనాలి? ఎంత డబ్బు ఇవ్వాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు డబ్బు మూటలతో వస్తున్నారు. ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు . ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్లండి..ప్రతి ఒక్కరికి చెప్పండి..అమ్మా..అక్కా..అన్నా..చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు..రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతారు. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. ఆపై చదువులు చదివే వారికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తారని చెప్పండి. పింఛన్ నెలకు రూ.3 వేల దాకా ఇస్తారని ప్రతి ఒక్కరికి చెప్పాలని వైయస్ జగన్ సూచించారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తారని, ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తాడని చెప్పండి. ఎలాంటి పథకం కావాలన్నా కూడా గ్రామంలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే మంజూరు చేయిస్తామని చెప్పండి. గ్రామంలోని ప్రతి 50 ఇండ్లకు గ్రామ వాలంటీర్ను నియమిస్తాం. ఆ చదువుకున్న పిల్లోడికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాం. అంతకన్న మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు ఈ ఉద్యోగం వదిలేసుకునే అవకాశం కల్పిస్తాం. నేరుగా సంక్షేమ పథకాలను డోర్ yð లీవరి చేయిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పండి. దుగ్గరాజపట్నం పోర్టు కచ్చితంగా కట్టి తీరుతామని చెప్పండి.