అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలి : వైయ‌స్‌ జగన్‌

 హైదరాబాద్‌ : పాకిస్తాన్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నాని ట్వీట్‌ చేశారు.  

బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత పైలట్‌ అభినందన్‌ పాక్‌ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్‌ ఓ విడియోను విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్‌ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత పైలట్‌ ఒకరు పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కారని భారత్‌ కూడా దృవీకరించింది

Back to Top