జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావుకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి: మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ రావు జయంతి సందర్భంగా  మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని తన నివాసంలో రామ్మోహ‌న్‌రావు చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Back to Top