టీడీపీ కార్యకర్తలు మొత్తం పులివెందులలో దిగారు

ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కుట్ర 

ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఫైర్‌

పులివెందుల: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైంద‌ని, అందుకే జిల్లాలోని ఆ పార్టీకి చెందిన మొత్తం నేత‌లు పులివెందుల‌లో దిగార‌ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్య‌ర్థి హేమంత్‌ రెడ్డి త‌ర‌ఫున ఎంపీ అవినాష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టం​గా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ పేరుతో ప్రజలకు నిండా ముంచారు. ఉప ఎన్నికల్లో గెలివలేరని కూటమికి అర్థమైంది. అందుకే కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త పెళ్లికి వెళ్తే దాడి చేశారు. వాళ్లపై కేసులు నమోదైనా.. మరోసారి దాడికి యత్నించారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కూటమి కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను కావాలనే బైండోవర్‌ చేస్తున్నారు. పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా?. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సంయమనం పాటించాలి. పోలీసులు బెదిరించి మరీ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించారు. ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేశారు. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను బైండోవర్‌ చేశారు` అని వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top