తాడేపల్లి: నేడు (బుధవారం 06.08.2025) మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల జిల్లా డోన్లో పర్యటించనున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల జిల్లా డోన్ చేరుకుంటారు, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న వైయస్ జగన్, అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.