తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలి

శ్రీకాకుళం జిల్లా నేతలతో వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: ఫొని తుఫాన్‌ ప్రభావంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలోని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణిలతో వైయస్‌ జగన్‌ ఫోన్లో మాట్లాడారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

 

Back to Top