టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ కృషి
10 Apr 2021 4:41 PM
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు
గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి
తిరుపతిలో బ్రాహ్మణ సంఘాల నేతల సమావేశం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం బ్రాహ్మణ సంఘాల నేతలు వారు సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల మనోభావాలను సీఎం వైయస్ జగన్ కాపాడారన్నారు. వంశపారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై బ్రాహ్మణులు సీఎం వైయస్ జగన్కు రుణపడి ఉన్నారు అని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం వైయస్ జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
అనంతరం బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బ్రాహ్మణుల పూర్వవైభవాన్ని సీఎం వైయస్ జగన్ ఇనుమడింపజేశారు. చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. బ్రాహ్మణ పేదల కోసం రూ.790 కోట్లతో ఈబీసీ నేస్తం. త్వరలోనే ఈబీసీ నేస్తంపై వర్క్షాప్ పెడతాం’ అని తెలిపారు.