విజయవాడ: లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోకి ఈనెల 31 వరకు భక్తులను అనుమతించడం లేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్డౌన్ కాలపరిమితి మే 31తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో దర్శనాలను నిలిపిస్తున్నామన్నారు. దేవాలయాల్లో సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు కొనసాగుతాయని చెప్పారు. అదే విధంగా ఆర్జిత సేవల కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులు ఆదేశించినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.