వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, జ‌న‌సేన నేత‌లు

తాడేప‌ల్లి: విజ‌య‌వాడ‌కు చెందిన ప‌లువురు టీడీపీ నేత‌లు, జ‌న‌సేన నాయ‌కులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో గండూరి మహేష్, నందెపు జగదీష్‌ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్‌ మెంబర్‌), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్‌ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జి) వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైయ‌స్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైయ‌స్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 

Back to Top