"బాస్' పదవి పోయినప్పటి నుంచి ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదు

 అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై మరోసారి ట్విటర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. 'బాస్' పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదని విమర్శించారు. వందల కోట్ల రూపాయలను దోచుకునే అవకాశం కోల్పోవడంతో 5 కోట్ల మంది ప్రజలపై ద్వేషాన్ని పెంచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నారని' చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

Back to Top