కొల్హాపూర్ అమ్మవారికి  పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ 

తిరుమ‌ల‌: దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్సవాల సందర్బంగా కొల్హాపూర్ శ్రీమహాలక్షి అమ్మవారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఘ‌న‌స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ దంప‌తులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించిన అనంత‌రం దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆశీర్వాదం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్య‌క్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు .

Back to Top