మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బ్రహ్మోత్సవాలకు రండి
21 Sep 2019 11:46 AM
సీఎం వైయస్ జగన్కు టీటీడీ ఆహ్వానం
ఆహ్వాన పత్రిక అందజేసిన చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ సింఘాల్
ఈనెల 30 నుంచి స్వామివారి వార్షిక ఉత్సవాలు
29న అంకురార్పణతో కార్యక్రమాలకు శ్రీకారం
తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్, అధికారులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రిక అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్కుమార్ సింఘాల్లు, ఇతర అధికారులు వెళ్లి సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 29వ తేదీన అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చడతారు. 30వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి.