కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నేడు విశాఖకు సీఎం వైయస్ జగన్
17 Dec 2021 12:04 PM
అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్తో పాటు.. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.
సీఎం వైయస్ జగన్ పర్యటన వివరాలు ఇలా..
- సాయంత్రం 5 గంటలకు సీఎం వైయస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు
- సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్లోఎన్ఏడీ ఫ్లై ఓవర్తో పాటు వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన మరో 6 ప్రాజెక్ట్లను ప్రారంభిస్తారు.
- సాయంత్రం 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్కు హాజరుకానున్న సీఎం జగన్.
- సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్తో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో 4 ప్రాజెక్ట్లను ప్రారంభించనున్న సీఎం.
- 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న సీఎం వైయస్ జగన్.
- రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం వైయస్ జగన్ తిరుగు ప్రయాణం.