వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత వేనాటి

తాడేప‌ల్లి: సూళ్లూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్‌ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైయ‌స్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

Back to Top