టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: ఏలూరు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు,  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో గోరుముచ్చు గోపాల్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  తణుకు వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు వైయ‌స్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ వైయ‌స్‌ఆర్ సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పాల్గొన్నారు. 

Back to Top