రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ సీపీలోకి భారీ చేరిక‌లు

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. జ‌న‌సేన‌, బీజేపీ టీడీపీకి చెందిన ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గంగూరులో టీడీపీ ఉయ్యూరు పట్టణ మాజీ అధ్యక్షుడు పొగిరి రాము వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేశ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు అయోధ్య రామిరెడ్డి సమక్షంలో పొగిరి రాము వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. 

  • నున్నకి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.
  • విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ సమక్షంలో 16, 17,18 డివిజన్‌లకు చెందిన 150 మంది బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీ ఓబీసీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. 
  • ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల నుంచి టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. 
  • రాయలసీమ బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు బళ్లారి వెంకటరాముడు వైయ‌స్ఆర్‌సీపీ కండువా క‌ప్పుకున్నారు. అనంతపురంలోని ఎ.నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. వెంక‌ట‌రాముడుతో పాటు బలిజ సంఘానికి చెందిన పలువురు నాయకులు కూడా పార్టీలో చేరారు. 
  • శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, రెస్కో మాజీ చైర్మన్‌ వనం గంగిరెడ్డి, ఆయన కుమారుడు సాయివర్ధన్‌రెడ్డి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్‌.మక్బూల్‌ అహ్మద్ వీరికి వైయ‌స్ఆర్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  
Back to Top