మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఉత్తరాంధ్రకు గుండెకాయ..విశాఖపట్నం
01 Aug 2020 4:12 PM
కొద్ది రోజుల్లో విశాఖ నుంచి పాలన ప్రారంభం
శివరామకృష్ణ కమిటీ సిఫార్సులతోనే సీఎం వైయస్ జగన్ వికేంద్రీకరణ బిల్లు
టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలి
మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం : కొద్ది రోజుల్లోనే విశాఖపట్నం నుంచి పాలన ప్రారంభం అవుతుందని మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాన్ని రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా ప్రకటించడం హర్షనీయమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం ఈ బిల్లు పట్ల సంతోషంగా ఉన్నారని, ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన చంద్రబాబు అభివృద్ది వికేంద్రీకరణ అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చారని మంత్రి గుర్తు చేశారు. సీఎం జగన్.. రాజధాని అభివృద్ధి కోసం జీఎన్ రావు కమిటీ వేశారని, ఆర్ధిక అసమానతలు తలెత్తి భవిష్యత్తులో ఉద్యమాలు రాకుండా వికేంద్రీకరణ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు.
ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో బాబు చెప్పగలరా?
అమరావతి కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో చెప్పగలరా అని చంద్రబాబును మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ప్రజలను వంచించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటామంటే ప్రజలు ఆమోదించరని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశ సుజల స్రవంతికి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని బాబును నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్దిపై ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ధి ఉందని అందుకే అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కాలనిర్దేశం పెట్టి పనులు చేపట్టారని తెలిపారు. అమరావతి భూముల ధరలు తగ్గుతాయని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రపంచ ఉద్యమంగా చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.
మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
ఉత్తరాంధ్రలో తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం గణాంకాలు ఇక్కడి ఆర్ధిక వెనుకబాటుతనానికి సూచిక అని తెలిపారు. అమరావతి రాజధానికి రూపకల్పన చేయడానికి ముందే చంద్రబాబు తన బంధుగణానికి ఆస్తులు సమకూర్చారని విమర్శించారు. సీఆర్డీఏ బిల్లు తీసుకువచ్చిన తన వాళ్లకు చంద్రబాబు మేలు చేశారని దుయ్యబట్టారు. ప్రజలంతా అమరావతి కోరుకుంటున్నారని చంద్రబాబు నమ్మితే.. టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని అప్పలరాజు సవాలు చేశారు.