టీడీపీకి షాక్‌.. శోభా హైమావ‌తి వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు న‌చ్చి పార్టీలో చేరా : శోభా హైమావ‌తి

తాడేప‌ల్లి: విజయనగరం జిల్లా ఎస్‌. కోట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేర‌కు శోభా హైమావ‌తికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సంద‌ర్భంగా శోభా హైమావ‌తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైయ‌స్ఆర్ సీపీలో చేరాన‌న్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. 

విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సీఎం వైయ‌స్ జగన్‌ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి  సీతారామ‌రాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం అవుతోందని చెప్పారు. 2024 ఎన్నికల నాటికి టీడీపీ నేతల్లో సగం మంది వైయ‌స్ఆర్ సీపీలో చేరుతారని చెప్పారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎంపీ డాక్టర్‌ డీవీజీ శంకరరావు కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.    

Back to Top