బలహీన వర్గాల గుండెచప్పుడు జగనన్న

ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలంటే జగనే మళ్లీ సీఎం కావాలి: మంత్రి గుమ్మనూరు జయరామ్‌

జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం: ఎంపీ గోరంట్ల మాధవ్‌

పేదల పెన్నిధి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగనన్న: ఎంపీ నందిగం సురేష్‌

సామాజిక సాధికారత సాకారం చేసిన సీఎం జగన్: ఎమ్మెల్యే తిప్పేస్వామి 

 శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర 

మడకశిర: మడకశిరలో సామాజిక సాధికారత పరిఢవిల్లింది. జగనన్న అండతో తాము సాధించిన సాధికారతను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నేతలు ప్రజలకు వివరించారు.  బైక్ ర్యాలీలో భారీగా శ్రేణులు పాల్గొన్నాయి. బహిరంగ సభ ప్రాంగణానికి నేతలు చేరుకోగానే జై జగన్ నినాదాలు మిన్నంటాయి. సభ ఆసాంతం వక్తల ప్రసంగాలను జనం ఆసక్తిగా విన్నారు. సామాజిక సాధికార యాత్ర మడకశిరలో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, డా.తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. వక్తలు ఏమన్నారంటే.. 

మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మాట్లాడుతూ....
– నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఆప్యాయంగా బడుగుబలహీనవర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న జగనన్న. 
– పేద పిల్లలకు జగనన్న మేనమామయ్యారు. అమ్మఒడి పథకంతో పేదలపై చదువుల భారం పడకుండా చేశారు.
– యూనిఫాం, షూ, టై, బ్యాగులు ఇచ్చి మన పిల్లలు గర్వంగా బడులకు వెళ్లేలా చేసిన జగనన్న. 
– మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సంక్షేమ పథకాల్లో వారికి జగనన్న పెద్దపీట.
– ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి ముఖ్యమంత్రిని మన అణగారిన వర్గాలు, పేదలు చూసి ఉండరు.
– చంద్రబాబు మోసపూరిత మాటలతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. ఆయనకు తోడుగా పవన్‌కళ్యాణ్‌ నేనున్నాను అంటున్నారు. ఈ తోడుదొంగల్ని నమ్మకండి.
– జగనన్న పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదాలు చూడకుండా అర్హులందరికీ పథకాలు.
- జగనన్న ప్రజాపాలకుడు, ప్రజానాయకుడు, అసలు సిసలు ప్రజల మనిషి.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ...

– ఇక్కడ చూస్తుంటే మడకశిర నియోజకవర్గమంతా కదిలివచ్చినట్టుంది.
– మనమంతా వైయస్సార్‌సీపీ సైనికులం. జగనన్న సైనికులం.
– సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన జగనన్న.
– బడుగు, బలహీన వర్గాలకు పెద్ద అండగా నిలిచి, ప్రోత్సహిస్తున్న జగనన్న.
- సామాజిక న్యాయం జరుగుతున్నది జగనన్న పాలనలోనే.
– చంద్రబాబు, పవన్‌ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిని ఓడిస్తామంటున్నారు. అబద్దాలతో ప్రచారాలు మొదలుపెట్టారు. కుట్రలు, కుతంత్రాల రాజకీయాలకు తెరతీశారు. 
– పేద ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం జగనన్నకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు.

ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ...

– జగనన్నకు పేదలంటే ప్రాణం. అణగారిన వర్గాలంటే అంతులేని అభిమానం. 
– పారదర్శకతతో సంక్షేమ పాలన, నవరత్నాలు అందిస్తూ.. పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలని తపించే నాయకుడు జగనన్న.
– ఈరోజు ప్రతి పేదవాడూ సంతోషంగా ఉన్నాడు.
– చదువుల్లో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చి.. మన బడుగు, బలహీన, పేదవర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న సీఎం జగన్‌. 
– చంద్రబాబులాంటి వ్యక్తి మాటలు నమ్మితే మనమంతా మునిగిపోయినట్టే. 
– అందుకే జాగ్రత్తగా ఆలోచించి...జగనన్నను గెలిపించుకోవాలి. అప్పుడే మన జీవితాలకు గ్యారంటీ. మన భవిష్యత్తుకు గ్యారంటీ. 
– ప్రజాసేవలో జగనన్నకు పోటీవచ్చే నాయకుడు మరొకరు లేరు.
– జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను దేశ, విదేశాల్లో ప్రశంసలు అందుతున్నాయి.
– నాలాంటి పేదవాడికి, దళితుడికి ఈ రోజు ఈ స్థాయికి తెచ్చి, ఎంపీగా పార్లమెంటుకు పంపిన జగనన్న పాలనలో సామాజిక సాధికారత గురించి ఎంత చెప్పినా తక్కువే.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజికంగా, ఆర్థికంగా పై స్థాయికి తీసుకెళ్తున్న జగనన్న.
– మనకు కావాల్సింది..మనకు అవసరమైనది జగనన్న పాలనే.
– మనమంతా బాగుండాలంటే జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలి.

ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి మాట్లాడుతూ....

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగనన్న ఈ నాలుగున్నరేళ్లలో ఎంతో మేలు చేశారు. 
– అటు సంక్షేమ పథకాలతో వారి ఆర్థిక స్థాయిని పెంచారు. ఇటు అధికార పదవుల్లో పెద్దపీట వేశారు. నామినేటెడ్‌ పదవుల్లో అగ్రస్థానం వారికే ఇచ్చారు. 
– బడుగు, బలహీనవర్గాలతో పాటు మహిళలకు పెద్ద ఎత్తున చేయూతనందించారు. 
– నాడు వైయస్సార్‌ మడకశిరపై ఎంతో ప్రేమ చూపారు. వెనుకబడిన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరాలని తపించారు. నీటి కొరత తీర్చేందుకు ఎంత ఖర్చయినా వెనకడుగు వేయలేదు.
– వైయస్సార్‌లానే ఆయన తనయుడు.. మన నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక పథకాల ద్వారా ఎంతో మేలు చేశారు.

ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ...

– అణగారిన వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుని, వారి బాగు కోసం అనేక సంక్షేమపథకాలను తీసుకొచ్చిన జగనన్న.
– లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలితో పాటు జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్‌లలో, సర్పంచ్‌ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే పెద్దపీట వేసిన ఘనత జగనన్నది.
– బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌ అని ఆ వర్గాలపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్న సీఎం జగన్‌.

Back to Top