మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
సీఎం వైయస్ జగన్ ఎప్పుడూ న్యాయం వైపే
24 May 2022 6:09 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు ఏ రోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా?
ఎమ్మెల్సీ అనంత్బాబు కేసు విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాం
ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంత్బాబు కేసు విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించామని తెలిపారు. మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
వనజాక్షి ఘటనను ఎవరూ మరచిపోలేదన్నారు. ఆ రోజు ఎమ్మార్వోపై దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. ఎమ్మెల్సీ కేసు విషయంలో ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ రోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా?. ఎమ్మెల్సీ అనంత్బాబు కేసు విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. సీఎం వైయస్ జగన్ ఎప్పుడూ న్యాయం వైపే నిలిచారని గుర్తు చేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపైన వార్తలు కూడా వచ్చేవి కావన్నారు. ఇప్పుడు ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు తమ రూల్స్ ఫాలో అయ్యారని తెలిపారు.