సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పారదర్శకంగా రాజకీయాలు 

బాబు  జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే 

ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుమల: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా రాజకీయాలు నడుపుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని విమ‌ర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని రోజా ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'కార్తీక​ మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. వెయ్యికాళ్ల మండపం త్వరలో ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్‌ ఏర్పాట్లు చేస్తున్నార‌ని రోజా తెలిపారు. 

ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని బాబు ఎదురు చూపు..

 తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే, హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చంద్ర‌బాబు ఎదురు చూస్తున్నార‌ని ఎమ్మెల్యే రోజా ధ్వ‌జ‌మెత్తారు. కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతన్న సమయంలో కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు కనీసం భరోసా కూడా కల్పించలేని పరిస్థితి చంద్రబాబుది. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నారు. వైయ‌స్ జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి మరణం సంభవించిన కుటుంబంలో పోటీపెట్టకుండా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టేందుకు లోకల్‌ బాడీ ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.   

టీడీపీ నేత‌లు భ్ర‌మ‌లో బ‌తుకుతున్నారు..

స్థానిక సంస్థల ఫండ్స్‌ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందిని ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకు చూపించి ఎన్నికలు వాయిదా పడేలా చేశార‌ని రోజా విమ‌ర్శించారు. ఇప్పుడేమో రాష్ట్రంలో కరోనా లేదని పెద్దమనుషులు ఆరాట పడుతూ ఎన్నికలు పెట్టాలని స్టేట్మెంట్స్‌ ఇస్తున్నారు. మార్చి లోపల ఎన్నికలు పెడితే టీడీపీ అన్ని స్థానాలు గెలుచుకుంటామనే భ్రమలో ఉంది. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మూడున్నర కోట్ల అప్పులో ముంచేసారు. రాష్ట్రంలో పదహారు నెలల కాలంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా సమయంలోనూ ప్రజలను ఆదుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ మాత్రమే అని రోజా  కొనియాడారు

Back to Top