రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయ‌స్ జగన్ వెంటే

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

 విజయవాడ: తాను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వదంతులను ఆయన ఖండించారు.  రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయ‌స్ జగన్ వెంటే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరానని, రాజకీయాల్లో ఉన్నంతవరకు వైయ‌స్సార్‌సీపీలోనే ఉంటానని తెలిపారు. పార్టీలో అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. వైయ‌స్సార్‌సీపీ కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని.. అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. పార్టీ మారే అవసరం లేదని తేల్చి చెప్పారు.

Back to Top