శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి షాక్‌

ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో 50 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

నంద్యాల‌:  శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన  50 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి.  సిద్దాపురం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈసం యేసు బాబు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టిడిపిని వీడి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  స‌మక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంత‌రం మేము సిద్ధం..మా బూత్ సిద్ధం స‌మావేశంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ..శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్‌ సీపీ విజయాన్ని ఆపలేరని, గెలుపే లక్ష్యంగా సీఎంగా మళ్లీ జగనన్నను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

 ఎన్నికల ప్రచారం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నాయకులు, కార్యకర్తలు ప్రజలు, ఓటర్లలో ఉత్సాహం నింపేలా, పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపలో వివరించాల‌న్నారు. ప్రతీ గ్రామం, ప్రతీ వార్డులోని ప్రతీ ఇంటిని సందర్శించి కార్యకర్తల మద్దతు తీసుకుంటానన్నారు. జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ఎన్నికల బరిలో గెలిచేందుకు ప్రతి ఒక్కరిని ఓట్లు అభ్యర్థిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యంలో పాల్గొనాలని చ‌క్ర‌పాణిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కుందూరు శివారెడ్డి, శిల్పా భువ‌నేశ్వ‌ర్‌రెడ్డి, పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ మీర్‌, రాజ‌మోహ‌న్‌రెడ్డి, జెడ్పీటీసీ శంక‌ర్‌రెడ్డి, జెడ్‌.శ్రీ‌నివాస‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top