వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
06 Jul 2022 5:39 PM
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న విశాల మైదానంలో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లును మంత్రి తానేటి వనిత, జోగి రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ర్టంలోని స్దానిక సంస్ధలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు దాదాపు 80 శాతం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్ధితులలో జరుగుతున్న ప్లీనరీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని తెలిపారు. ఇది ఓ పెద్ద పండుగ అన్నారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలకు రాష్ర్టం నలుమూలలనుంచి కార్యకర్తలు హాజరవుతారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ గర్వపడేలా రీతిలో నిర్వహించుకోవాలన్నారు. కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వసతి, బోజనం, రవాణా వంటివాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కో - ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.