ఏపీలో నైట్ కర్ఫ్యూ..

 కోవిడ్‌ పరిస్థితులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమీక్ష

రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

మాస్కులు పెట్టుకోని వారికి భారీ జరిమానా 

తాడేప‌ల్లి: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్ మాట్లాడుతూ.. అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా బాధితులకు ఇచ్చే హోంకిట్లలో మార్పులు చేయాలని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్క్ పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలని ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని చెప్పారు.

కోవిడ్ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చూడాలని వైయ‌స్ జగన్ చెప్పారు. 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని సూచించారు. థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించి అనుమతించకూడదని ఆదేశించారు.

  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష ముఖ్యాంశాలు ..

  • కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన సీఎం
  • దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని వివరించిన అధికారులు
  • కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్పలక్షణాలు ఉంటున్నాయన్న అధికారులు
  • కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం
  • ఆమేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్న సీఎం
  • వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలన్న సీఎం
  • అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలన్న సీఎం
  • అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్న ముఖ్యమంత్రి
  • 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలన్న సీఎం
  • ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలన్న సీఎం
  • నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న సీఎం
  • అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం
  • భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్న సీఎం
  • మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్న సీఎం
  • దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలన్న సీఎం
  • బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం
  • బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశం
  • థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశం, మాస్క్‌తప్పనిసరి చేయాలని ఆదేశం
  • రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ ఉంచాలని ఆదేశం
  • దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం
  • ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేయనున్న వైద్య ఆరోగ్యశాఖ
     
Back to Top