ఎన్ఐఏ ద‌ర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌

విజయవాడ:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం స్టేను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ నెల 30లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టు ముందు పెట్టాలని ఎన్‌ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. 

 

Back to Top