టెన్త్‌ ఫలితాలపై లోకేష్‌తో చర్చకు సిద్ధం

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: టెన్త్‌ ఫలితాలపై లోకేష్‌తో చర్చకు సిద్ధమని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు. జూమ్‌ మీటింగ్‌ నుంచి లోకేష్‌ ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు అడిగితేనే కొడాలి నాని, వంశీ, రజనీ జూమ్‌ మీటింగ్‌లో ఎంటర్‌ అయ్యారని తెలిపారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. నిన్నటి కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో మరింత ఎదురుదాడి చేస్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. 

 

Back to Top