బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదు
07 Nov 2020 3:53 PM
దళితులను కించ పరిచే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్
తాడేపల్లి: 2024 లో అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదని ఎంపీ నందిగం సురేశ్ జోస్యం చెప్పారు. ఆ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ కొల్లేరులో ట్రాక్టర్ నెట్టాడని, పార్టీని కూడా నెట్టుతాడని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని సురేశ్ తెలిపారు. రాష్ట్రంలో దళితులంతా ఏకంగా ఉన్నారని తెలిపారు. దళితులను కించ పరిచే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో దళితులకు మేలు జరుగుతోందని చంద్రబాబు అక్కసుతో ఉన్నారని అన్నారు. సీఎం వైయస్ జగన్ను ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సీఎం వైయస్ జగన్కు అండగా ఉన్నారని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ సురేశ్ శనివారం మీడియాతో మాట్లాడారు.
దళిత మేధావి అంటూ ఒకరు చంద్రబాబు యూజర్గా మారారు..
దళితుల ముసుగులో చేసే ఉద్యమంలో జై భీమ్ బదులు జై చంద్రబాబు అంటే బాగుంటుందని నందిగం సురేశ్ ఎద్దేవా చేశారు. దళిత మేధావి అంటూ ఒకరు చంద్రబాబు యూజర్గా మారారని విమర్శించారు. దళితులకు అన్యాయం జరుగుతోందని చెప్తున్న ఆ మేధావి రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని కొత్త గళం వినిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో హిట్లర్ నియంత పాలన సాగిందని గుర్తు చేశారు. బాబు హయంలో జరిగిన అన్యాయంపై ఆనాడే ప్రశ్నించి ఉండాలని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో ఈ మేధావులు పుట్టుకొస్తున్నారని చురకలంటించారు.
ఈ మేధావులంతా అప్పుడేమయ్యారు!
చంద్రబాబు దళిత పిల్లల ఫీజులు ఎగ్గొట్టినప్పుడు ఈ మేధావులంతా ఏమయ్యారని ఎంపీ నందిగం సురేశ్ సూటిగా ప్రశ్నించారు. బాబు డైరెక్షన్లో కాకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని హితవు పలికారు. పేదలకు ఇళ్లు, ఇంగ్లీషు విద్య అడ్డుపడవద్దని చంద్రబాబుకు ఈ మేధావి చెప్పాలని సురేష్ అన్నారు.