అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలకు చంద్రబాబే కారకుడు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 
 

గుంటూరు:  అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలకు టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబే కారకుడ‌ని వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిప‌డ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలోచంద్రబాబు పాపాలను సీఎం వైయ‌స్ జగన్ ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు. 1996లో అగ్రిగోల్డ్ సంస్థకు అనుమతులు దక్కిందీ, ఆ సంస్థ బోర్డు తిప్పేసిందీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలే దోచుకున్నారని విమ‌ర్శించారు.

అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని, మధ్య తరగతి డిపాజిట్ దారులను తీవ్ర వేదనకు గురిచేశారని అన్నారు. 300 మంది బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారకుడయ్యారని విమర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గుర్తించారని, అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని నాడు హామీ ఇచ్చారని శ్రీదేవి పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు చేశామని, రేపు (ఆగస్టు 24) రూ.20 వేల లోపు బాధితులకు చెల్లింపులు చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీ‌దేవి వివరించారు.

Back to Top