ఎమ్మెల్యే రోజాకు శస్త్ర చికిత్స

రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి

సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి  

చెన్నై: ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజాకు శస్త్ర చికిత్స జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్‌ ఆపరేషన్లు నిర్వహించారు. ఐసీయూ నుంచి నేడు వార్డుకు తరలించారు. ఈ క్రమంలో మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్‌ విడుదల చేశారు. 
ఇది వరకే ఆమెకు ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా, ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుటపడుతోందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు.

Back to Top