వైయస్‌ జగన్‌ పాలనకు ప్రకృతి కూడా సహకారం

ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తుందని ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం  నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి కుడి కాలువకు ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి నీరు విడుదల చేశారు. 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  8 ఏళ్లుగా నిండని నాగార్జున సాగర్‌కు ఇప్పుడు నీళ్లు వచ్చాయని చెప్పారు. రైతులందరికీ ఇక మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. 
 

Back to Top