కృష్ణాజిల్లా: తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో మిచౌంగ్ తుపాన్ కారణంగా నీట మునిగిన వరి పొలాలను అధికారులతో కలిసి పంట పొలాలను ఎమ్మెల్యే కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తుపాన్ కారణంగా వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి.. తుపాన్ సమయంలో సీఎం ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేశారు. మా ప్రాంతంలో రైతుల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. రైతులను పూర్తిగా ఆదుకుందామని సీఎం చెప్పారు అని కొడాలి నాని తెలిపారు. ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా సహాయం చేద్దామని సీఎం చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆర్బీకేల ద్వారా రెండు రోజుల్లో సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విత్తనాలపై రైతులు అడిగిన దానికంటే ఎక్కువగానే సబ్సిడీ ఇద్దామని సీఎం చెప్పారు.. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం.. రంగు మారినా, పని కొచ్చినా, పనికి రాక పోయినా మద్దతు ధరకే కొనాలని నిర్ణయం తీసుకుంటారని రైతాంగం ఎవరూ ఆందోళన చెందవద్దు అని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. గతంలో రైతులు పండించిన ధాన్యానికి మూడు నాలుగు నెలలకు కూడా డబ్బులు పడేవి కాదు.. కానీ ఈ ప్రభుత్వంలో ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు వేస్తోంది.. త్వరలోనే ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ పర్యటిస్తారని కొడాలి నాని చెప్పారు.